ప్రముఖ నటి గౌతమి ప్రారంభించిన ‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ ద్వారా కేన్సర్ పై అవేర్ నెస్ ర్యాలీని వైజాగ్ లో నిర్వహించనున్నారు. ఈ నెల 28న నిర్వహించనున్న ఈ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ, అరకు ఎంపీ కొత్తపల్లి గీత, టాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బాలయ్య తన అభిమానులకు పిలుపు నిచ్చారు. కాగా, హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, రీసెర్చి సెంటర్ చైర్మన్ గా బాలకృష్ణ ఉన్నారు. కేన్సర్ నివారణకు తన వంతు పాత్రను ఆయన పోషిస్తున్నారు.