డీఎడ్ 2019 -21 రెగ్యులర్ బ్యాచ్ రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల అయినట్లు కర్నూలు జిల్లా డీఈవో డాక్టర్ రంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది జూలై 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెబ్సైట్లో చూసుకోవాలన్నారు.
మార్కుల రీకౌంటింగ్ ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించిన స్లిప్ తో పరీక్షల విభాగం విజయవాడకు అందజేయాలన్నారు. ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 రూపాయల చలానా ఏపీసిఎఫ్ఎంఎస్ విధానం ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు.