కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరివెళ్ల మండలం గోవింద పల్లి గ్రామానికి చెందిన కూలీలు కడప జిల్లా సూద్దపల్లి కి ట్రాక్టర్ లో వెళ్తుండగా వెనుక నుండి లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెంకటమ్మ అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందిన, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.