కౌతాళం పోలీస్ స్టేషన్ పరిధిలోని మదిరె గ్రామంలో వ్యక్తి గొంతు కోసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోయ హనుమేష్ (30) ఇంట్లో ఎవరు లేని సమయంలో గొంతు కోసుకున్నాడు. కూలికి వెళ్లి వచ్చిన భార్య చూసి ఆదోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించినట్లు తెలిపారు. గొంతు కోసుకోవడానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.