టెలికాం రంగంలో జియో ఓ సంచలనం. ధన్ ధనా ధన్ ఆఫర్తో తక్కువ ధరకే డేటాను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంది. తాజాగా దీపావళి పండగను పురస్కరించుకుని మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. దీపావళీ ధన్ ధనా ధన్ ఆఫర్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లో రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే 100శాతం క్యాష్బ్యాక్ ఇవ్వనుంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ ఆఫర్ అక్టోబర్ 18 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్యాష్బ్యాక్ వోచర్ల రూపంలో లభిస్తుంది. వీటిని మళ్లీ రీఛార్జ్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. రూ.399 ఆఫర్తో ప్రీపెయిడ్ కస్టమర్లకు 84జీబీ డేటా(రోజుకు 1జీబీ) ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత కాలింగ్స్ అందిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 84రోజులు. అయితే తాజాగా తీసుకొచ్చిన దీపావళి ధన్ ధనా ధన్ ఆఫర్లో కస్టమర్లు అక్టోబర్ 12 నుంచి 18 మధ్య రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే.. వారికి రూ.50 విలువ గల 8 వోచర్లు వస్తాయి. అంటే మొత్తం రూ.400 వస్తుంది. ఈ వోచర్లను మళ్లీ రీఛార్జ్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. నవంబర్ 15 తర్వాత మాత్రమే ఈ వోచర్లను వినియోగించుకోవచ్చు. అయితే రూ.309 అంతకంటే ఎక్కువ ప్లాన్కు మాత్రమే ఈ వోచర్లు వర్తిస్తాయి. ఇప్పటికే ఏదైనా జియో ప్లాన్ వినియోగించుకుంటున్నవారు ఈ ఆఫర్ తీసుకుంటే ప్రస్తుత ప్లాన్ ముగిసిన తర్వాతే ఈ కొత్త ఆఫర్ ప్రారంభమవుతుంది.