స్నేహితులతో కలిసి ఆడడానికి వెళ్లి నీటి కుంటలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన కౌతాళంలో సోమవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నబి రసూల్ (12) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి కౌతాళం ఉరుకుంద మధ్యలో ఉన్న నీటి కుంట దగ్గరకు వెళ్లారు. స్నేహితులతో ఆడుకుంటూ నీటి కుంటలో పడి మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు లేకపోవడంతో అక్కల వద్ద ఉంటున్నాడు. తమ్ముడు మృతి చందనంతో తోటి చెల్లెళ్లు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి తెప్పించింది.