ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిరప రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 01:34 PM

కర్నూలు జిల్లాలోని మిరప రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు మండలం టీఎస్‌ కూళూరు, కే. తిమ్మాపురం, దైవందిన్నె గ్రామాల్లో గౌరవ సభలు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎమ్మిగనూరు ప్రాంతంలో రైతులు అధికంగా మిరప సాగు చేశారని అన్నారు. వైరస్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరిని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పలకరించిన పాపాన పోలేదన్నారు.


ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కక్ష గట్టి వేధింపులకు గురిచేయటం, అక్రమ కేసులు పెట్టి అణగదొక్కాలని చూస్తున్నారని అన్నారు. అనేక రాష్ర్టాల్లో పెట్రోల్‌, డీజీల్‌ ధరలను ఆయా ప్రభుత్వాలు తగ్గిస్తే సీఎం జగన్‌ మాత్రం తగ్గించలేదని అన్నారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com