అనుమానాస్పద స్థితిలో ఓ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందికొట్కూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రహదారిలో వేణు (27), కళ్యాణి (24) దంపతులు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.
వేణు స్థానికంగా ఒక హోటల్లో టీ మాస్టర్ గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తలుపు వేసుకుని ఇంట్లో ఉన్న దంపతులు ఆదివారం 11 గంటలైన ఇంట్లో నుండి ఎవరు బయటకు రాకపోవడంతో కాలనీ వాసులు ఇంటి వద్దకు చేరుకుని కిటికీ నుండి చూశారు.
వేణు ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఉండగా, కళ్యాణి మంచం దగ్గరే రక్తపు మడుగులో పడివుంది. దంపతులు ఇద్దరు మఅతి చెందింది. దంపతులిద్దరూ విగతజీవులుగా పడివుండటాన్ని చూసి స్థానికులు పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న ఎస్సై ఎన్. వి రమణ సంఘటన స్థలానికి చేరుకుని మఅతదేహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎందుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎన్. వి రమణ తెలిపారు.