కర్నూలు: ఎద్దుల బండి ఢీకొని రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దకడబూరు మండల పరిధి లోని కంబళదిన్నె గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు రామకృష్ణ జాలవాడి గ్రామం నుంచి స్వగ్రామమైన బైక్ పై బయలుదేరాడు.
కంబళదిన్నె సమీపంలోనే చర్చి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఎద్దుల బండి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి అంబులెన్స్ లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరొకరు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.