కర్నూలు: నంద్యాల డివిజన్ పరిధిలోని గోస్పాడు మండలం దీబగుంట్లలో నాగశేషుడు అనే వ్యక్తిని గొడ్డలితో దుండగులు నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని చేస్తున్నారు.