కర్నూలు నగరంలోని స్థానిక కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) ఎం. కె. వి శ్రీనివాసులు, సెబ్ జాయింట్ డైరెక్టర్ తూహిన్ సిన్హా, డిఆర్ఓ పుల్లయ్య, డిఎఫ్ఓ ప్రసున్న, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డిఆర్డిఏ పిడి వెంకటేశులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రమాదేవి, రాఘవేంద్ర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.