తిరుమల : సహారా ఇండియా చైర్మన్ సుభ్రతారాయ్ బుధవారం తిరుమలలో పర్యటించారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని సుభ్రతారాయ్ దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సుభ్రతారాయ్కు వేదపండితులు ఆశీర్వచనం అందించి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని సుభ్రతారాయ్ చెప్పారు.