ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా పూలతోట అనే గ్రామంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా శనివారం బావిలోకి దూకింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడేందుకు యత్నించారు. బయటకు తీయగా అప్పటికే ఇద్దరు పిల్లలు మరణించారు. తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.