కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని సూదేపల్లె గ్రామానికి చెందిన లీలావతిరెడ్డి ఎంఎస్సీ అగ్రికల్చర్ లో గోల్డ్ మెడల్ సాధించింది. తిరుపతిలోని ఆచార్య ఎస్జీ రంగా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో 51 ఆనివల్ కన్వోకేషన్ లో ఈ ఘనత సాధించినట్లు కుటుంబీకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘనత సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తండ్రి సూదేపల్లి మాజీ ఎంపిటిసి శర్వారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బాగా చదువుకొని మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన లీలావతిరెడ్డికి గోల్డ్ మెడల్ రావడం పట్ల గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.