ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేషపూజలు జరిపిస్తారు. సాయంకాలం స్వామివార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం ఉంటుంది. అనంతరం స్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.