కర్నూలు జిల్లాలో డీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈనెల 10వ తేదీలోపు చెల్లించాలని డీఈవో రంగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ. 150, మూడు సబ్జెక్టులకు రూ. 140, రెండు సబ్జెక్టులకు రూ. 120, ఒక సబ్జెక్టుకు రూ. 100 ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాలని పేర్కొన్నారు.