కర్నూలు నగరంలోని 3వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో స్వామిరెడ్డి నగర్కు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ వలి (45) ప్రమాదవశాత్తూ కేసీ కెనాల్ లో పడి మృతి చెందాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గురువారం ఇదే కాలనీలో నివసించే చాంద్ బాషా అనారోగ్యంతో మృతి చెందాడు.
ముస్లిం సంప్రదాయం ప్రకారం అతని అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్లే వారు స్నానం చేసి వెళ్లాల్సి ఉంది. దీంతో సమీపంలోనే కేసీ కెనాల్ లో దిగి స్నానం చేసేందుకు వెళ్లిన సయ్యద్ వలి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. స్థానికులు గమనించి కేకలు వేయడంతో యువకులు అతన్ని బయటికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.