ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎస్ఏ) చేపట్టిన యాత్ర గురువారం కర్నూలు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్సిటీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (టౌన్ మోడల్), మరో మూడు సంక్షేమ హాస్టళ్లల్లో విద్యారంగ పరిరక్షణ సభలను నిర్వహించారు.
ఈ సభల్లో ఎన్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్, అశోక్ మాట్లాడారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి విద్యార్థికి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు వర్తింప జేయాలన్నారు.