ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజేతలు గుంటూరు జిల్లా వృషభాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 09:54 AM

మహానంది క్షేత్రంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్స్‌ ఒంగోలు జాతి వృషభాల పోటీల్లో గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన పీఆర్‌ మోమోరియల్‌, పీఆర్‌బుల్స్‌ పులగం త్రిషజ్నారెడ్డి వృషభాలు 2610. 09 అడుగుల దూరం లాగి ప్రఽథమ స్థానం దక్కించుకున్నట్ల  రైతు కమిటీ సభ్యులు కందుల రఘురామిరెడ్డి, కొమ్మా శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. అలాగే ద్వితీయ స్థానాన్ని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేటకు చెందిన కాశయ్య వృషభాలు 2135 అడుగుల దూరం లాగాయి. మూడో స్థానాన్ని నంద్యాల మండలం బిళ్ళలాపురానికి చెందిన గోవర్దనరెడ్డి వృషభాలు 2115 అడుగుల దూరం లాగాయి. అలాగే నాలుగో స్థానాన్ని ప్రకాశం జిల్లా పోలేపల్లి గ్రామానికి చెందిన అనూష వృషభాలు 1813 అడుగులు లాగాయి. విజేతలైన వృషభాల యజమానులకు శ్రీశైలం నియోజికవర్గం వైసీపీ సమన్యయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి, ఎంపీపీ యశస్వీనిని బహుమతులను అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa