ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహదారి ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు: డీజీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2017, 01:09 PM

అమరావతి: రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామనా డీజీపీ సాంబశివరావు తెలిపారు. రహదారి ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువ మంది చనిపోతున్నారని ఆయన వివరించారు. రహదారి ప్రమాదాల మరణాల్లో 35 శాతం మంది ద్విచక్రవాహనదారులే ఉన్నారని ఆయన చెప్పారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరుతున్నానని ఆయన అన్నారు. ప్రమాదాలు తగ్గించేందుకే హెల్మెట్ఉన్నవారికే పెట్రోలు పోయాలని బంకు యజమానులకు సూచించామని ఆయన వెల్లడించారు. నో హెల్మెట్ నోపెట్రోల్ నిబంధన తప్పనిసరి కాదన్నారు. రాష్ట్రంలో బెట్టింగ్ సంస్కృతి పెరుగుతోందన్నారు. బెట్టింగ్ కారణంగా జరిగే నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని ఆయన వివరించారు. కొందరు క్రికెట్ గేమ్ నేర్చుకుంటుంటే.. మరికొందరు బెట్టింగ్ గేమ్ నేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. బెట్టింగ్ లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com