న్యూఢిల్లీ : ఢిల్లీలో బాణసంచా విక్రయాలపై నిషేధాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. నవంబర్ 1వ తేదీ వరకు బాణసంచా విక్రయించొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరిగినందున టపాసుల విక్రయాలపై నిషేధం విధించారు. దేశ రాజధానిలో దీపావళి పండుగ సమయంలో కాలుష్యం బాగా పెరిగిపోతుందని.. టపాసులను నిషేధించాలని ముగ్గురు పిల్లలు 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ప్రతీ ఏడాది దీపావళి పండుగ రోజు ఢిల్లీలో దట్టమైన పొగ కమ్ముకొని.. కాలుష్యం అవుతున్న విషయం తెలిసిందే.