కర్నూలు: ఎన్ని పాదయాత్రలు చేసినా వైకాపా అధినేత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. తెదేపా హయాంలో అభివృద్ధిని చూసి వైకాపా ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనన్న భయం జగన్కు పట్టుకుందని చెప్పారు. ఈ సందర్భంగా నిషిద్ధ భూముల జాబితా నిర్లక్ష్యంపై ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై స్పందించిన ఆయన.. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.