ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లధ్వజారోహణం సకల దేవతలకు ఆహ్వానం.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 06:03 PM

మహానంది ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా వేద పండితుల వేద మంత్రాలతో నిర్వహించారు.


మయూర వాహనంపై స్వామివార్లకు ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం సాయంకాలం శ్రీ గంగ కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామి వార్లను మయూర వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఉత్సవం నిర్వహించారు.


అనంతరం పండితుల వేద మంత్రాలతో ఈవో చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్ మహేశ్వర్ రెడ్డిలచె ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. నారికేళ కుష్మాండ బలి ఇచ్చి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను అధికారులచే పాలకమండలి చే నిర్వహించారు.


నందీశ్వరుని చిత్రపటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పుష్కరిణికి ప్రత్యేక హారతులను ఇచ్చారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ మధు ధర్మకర్తలు గంగిశెట్టి మల్లికార్జున, బుసకానివెంకటేశ్వర్లు, బండి హేమలత, తపిల లక్షమ్మ, తదితర అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa