రానున్న సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నట్టు పరిస్థితులు సూచిస్తున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే సర్వేలు పూర్తి చేసుకుని.. ఒక ఆలోచనకు పార్టీలు వచ్చినట్టే ఉన్నాయి . ఇటీవల గుంటూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి సంబంధించి అక్కడి ప్రజాప్రతినిధులు రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న క్రమంలో అక్కడి నాయకులను పిలిచి అధినేత చంద్రబాబు నాయుడు మందలించినట్లు సమాచారం. ఏ నియోజకవర్గంలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న విషయమై ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక జనసేన పార్టీతో పొత్తు ఉన్నట్లయితే జిల్లాలో వారికి రెండు సీట్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ కూడా జిల్లాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించుకుంటోన్న వైసీపీ ప్రజల్లో కంటే నేతల వ్యవహార శైలితో వ్యతిరేకత వస్తున్నట్లు సర్వేలో తేలినట్టు సమాచారం. ఇప్పటికే ర్యాంకుల పరంగా ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేసుకున్న వైసీపీ అధినేత జగన్ గతంలో ర్యాంకుల పరంగా ముందున్న ఎమ్మెల్యేలు ఇప్పడు ఎందుకు వెనుకబడుతున్నారన్న విషయంపై " సమగ్ర నివేదికను రూపొందించాలని ఇంటిలిజెన్స్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు పార్టీలో తమకు పోటీకి వచ్చే నేతలపై ‘కోవర్టు' ముద్రవేసి అధిష్టానం దృష్టిలో వారిని చులకన చేయాలన్న నిర్ణయంతో టికెట్ ఆశిస్తున్న కొందరు అటువంటి వారిపై కోవర్టు ముద్ర వేసి ప్రచారం చేయడానికి సామాజిక మాద్యమాలతో పాటుగా,తమకు అనుకూలమైన వ్యక్తులతో ప్రచారం చేయించడానికి పూనుకుంటున్నట్టు సమాచారం.
తమ పని తీరుపై తామే సర్వేలుతమ పనితీరుపై తామే సర్వేలు నిర్వహించుకుంటూ పొరపాట్లను సరిచేసుకుంటున్న నేపధ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు కూడా అధికార పార్టీ ప్రాభవాన్ని ఎంత మేరకు తగ్గించగలిగాము.. అదే విధంగా తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు.. అన్న కోణంలో కొందరు నేతలు నియోజకవర్గాలలో సర్వేలు చేయించుకున్నట్టు సమాచారం.
గుంటూరు జిల్లాలో అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇటు ప్రతిపక్ష పార్టీ ఇన్చార్జులు, అసెంబ్లీ సెగ్మంట్లలో పోటీ చేయాలకునే ద్వితీయ శ్రేణి నేతలు కూడా సర్వేల మోజులోనే ఉన్నారు.
ఇప్పటికీ మూడు సార్లు సర్వే నిర్వహించిన క్రమంలో కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా ఉన్న నేతల పేర్లు రాకపోవడంతో అక్కడ కొత్త వారిని రంగంలోకి దించాలనే ఆలోచన టీడీపీ అధినేత కు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గంలో వ్యక్తి గుణగణాలను, ఆర్థిక, సామాజిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.
కోటరీ చర్యలతో దూరమవుతోన్న కేడర్గతంలో టీడీపీ అనుసరించిన విధానమే ఇప్పుడు అధికార పార్టీలో జరుగుతోందని పార్టీని నమ్మకున్న కేడర్ అభిప్రాయ పడుతూ నేతపై అసంతృప్తి రాగం ఆలపిస్తున్నారు. అధికారంలోకి రాక ముందు ఐక్యంగా ఉన్న నేతలు, కారకర్తలు ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరమవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో తాము ఏదైనా నియోజకవర్గం పెద్దలకు చెప్పాలంటే అక్కడదాక వెళ్లే పరిస్థితి కానరాక కేడర్ లో నిరాశ వ్యక్తమవుతోంది. ఏదో ఒకటి చెప్పాలని వస్తే సదరు నేత వద్దకోటరి దగ్గర ఉండటంతో ఏమి చెప్పలేక కేడర్ వెనుదిరుగుతున్నామని కొందరు వాపోతున్నారు.
దూరమవుతున్న నాయకులుఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలు కూడా వారిని విస్మరిస్తుండటంతో పార్టీకి దూరమవుతున్నారు.
కోట్ల రూపాయలు ధారపోసి ఎమ్మెల్యేలు ఎన్నికైన వ్యక్తలకు తన చుట్టూ కోటరీ ఉంటేనే పని జరుగుతుందనుకోవడం పొరపాటని, కోటరీతో నష్టాలే ఎక్కువని గ్రహించలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కోటరీ నాయకులకే పనులవుతుండడం.. పార్టీ కోసం పని చేసిన వారికి పనులు కాకపోవడంతో అనేక మంది పార్టీకి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారు.
మొత్తంగా జిల్లాలో సర్వేలు వేడి పుట్టిస్తుండగా... కొందరు నేతలకు కోవర్టుల భయం పట్టుకుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa