ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాభిప్రాయ సేకరణ ప్రతులను విఆర్ఓ కు అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 09:12 AM

కొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ చేప ట్టరా అని నంద్యాల జిల్లా సాధన సమితి జేఏసీ నాయకుడు, అడ్వకేట్ డాక్టర్ బాలస్వామి ప్రశ్నించారు. బుధవారం పాణ్యం మండలంలో సేకరించిన 15 వేల ప్రజాభిప్రాయ సేకరణ అర్జీలను కలెక్టర్, డీఆర్వోలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పాణ్యంలో మాట్లాడుతూ జనవరి 22న రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ 54 జీవో జారీ చేసిందన్నారు.


ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ప్రభుత్వం జీవోలో నిర్దేశించిందన్నారు. కలెక్టర్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా కర్నూలుకు వెళ్లి తమ అభిప్రాయాలను తెలపాలని పేర్కొ నడం గమనార్హమన్నారు. 80 కిలోమీటర్ల దూరం వెళ్లి పేద, నిరక్షరాస్య ప్రజలు ఎలా తమ అభిప్రాయాలను తెలుపుతారన్నారు.


అభిప్రాయాలను సేకరించాలని తహసీల్దార్లకు ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని ప్రశ్నించారు. పాణ్యం మండలంలో మొదటి విడతగా 35 వేలు, రెండవ విడతగా 15 వేల అభిప్రాయా లను సేకరించామన్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఈ సమస్యపై చొరవ చూపాలని కోరారు.


ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రంగరమేష్, వైసీపీ, టీడీపీ, బీజేనీ, సీపీఎం, మాలమహానాడు, ఏఐఎల్బీ, ఆర్వీఎఫ్ నాయకులు ముర ళీధరరెడ్డి, రాంమోహన్నాయుడు, రమణారెడ్డి, భాస్కర్, దేవదత్తు, శ్రీనివాసులు, ప్రతాప్, సునీల్, నాగరాజు, కేశన్న, రమణ, మోహన్, రాజశేఖర్, పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa