ఢిల్లీ మారుతీ సుజికీ ఫ్యాక్టరీలోకి చిరుత ప్రవేశించింది. గూర్గావ్లో ఉన్న ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం చిరుత కనిపించింది. కంపెనీలో ఉన్న సీసీటీవీకి అది చిక్కింది. మనేసర్ ప్లాంట్లో తెల్లవారుజామున 4 గంటలకు చిరుత సంచరిస్తూ కనినించింది. దీంతో ఫ్యాక్టరీ ప్రాంతాన్ని మూసివేశారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. ప్లాంట్లోని ఇంజిన్ డిపార్ట్మెంట్లో చిరుత తిరుగుతున్నట్లు సెక్యూర్టీ సిబ్బంది గుర్తించారు. ఉదయం 7 గంటల షిఫ్ట్ కోసం వచ్చిన వేలాది మంది ఉద్యోగులను భద్రత దృష్ట్యా బయటనే ఉండాలని సూచించారు.