తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 6 గంటలు, కాలి నడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 84,373 మంది భక్తులు దర్శించుకోగా 35,861 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.29 కోట్లుగా ఉంది.