కర్నూలు జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు ఆయా పంటలు నీటమునిగాయి. చాగలమర్రి మండలం నేలపాడు గ్రామంలో వరద నీరంతా ఇళ్లల్లోకి వచ్చింది. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా నీటిలోనే ఉండి వాటిని బయటకు పారబోస్తూ గడిపినట్లు పలువురు తెలిపారు. అలాగే అదే గ్రామంలో వందలాది ఎకరాల్లో పంటలన్నీ నీటమునిగాయి. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పంటలన్నీ నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళకు గురవుతున్నారు.