మహానంది ఆలయం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, ఇందుకు దాతలు సహకారం ఎంతో అవసరమని ఇఒ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మహానంది ఆలయ కార్యాలయ భవనంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయంలో పని చేసే ఉద్యోగస్తులు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల పట్ల ఆలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు. ఆలయ ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాలలోపే భక్తులకు కోనేరు స్నానాలు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న షాపుల వద్ద గుట్కా, సిగరెట్, మత్తు పానీయాల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి దృష్ట్యా రోడ్డు పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరామన్నారు. దాతల సహకారంతో క్షేత్ర పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ కొరకు ఆర్చీలు ఏర్పాటు చేసి, నిరంతరం శివ నామస్మరణ వినిపించేలా మైకులు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం వసతి గృహాలు మరమ్మతులు చేయించి అందుబాటులో తెస్తామన్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న ప్రైవేటు టెండర్ల రేట్లు వివరాలను భక్తులకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయంలో పని చేసే ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి యూనిఫామ్, బొట్టు, ఐడి కార్డు కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa