ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి మల్లన్న స్పర్శ దర్శనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 17, 2022, 12:42 PM

శ్రీశైలంలో ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో ఎస్‌. లవన్న తెలిపారు. సామూహిక అభిషేక సేవాకర్తలు, విరామ దర్శన సేవాకర్తలకు ఈ ఐదు రోజులు స్పర్శ దర్శనం అవకాశం కల్పించామని చెప్పారు. అలాగే గురు, శుక్రవారాలలో భక్తులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవచ్చన్నారు. ఈ ఐదు రోజులు అన్ని అర్జిత సేవలు యథావిధిగా ఉంటాయన్నారు. జ్యోతిర్ముడి కలిగిన శివదీక్ష భక్తులకు ఈ ఐదు రోజులలో నిర్దిష్ట సమయాలలో విడతల వారీగా స్పర్శ దర్శనం కల్పిస్తామన్నారు. అయితే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు స్వర్శదర్శనానికి అవకాశం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa