రాష్ట్ర ప్రజానీకంతో పాటు, దేశ, విదేశాల్లో ఉంటున్న తెలుగువారికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అమ్మవార్ల ఆశీస్సులు కోరుకుంటున్నానన్నారు. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం అడ్డుకోవాలని దుష్టశక్తులు కుతంత్రాలు పన్నుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కూడా రాక్షసత్వమేనని దుయ్యబట్టారు. అభివృద్ధి నిరోధక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని ఆకాంక్షించారు.