మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయ్ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా లఖ్నవూలోని ఇంట్లో వాజ్పేయ్ ఉండకపోవడంతో పురపాలక అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని లఖ్నవూ మున్సిపల్ అధికారి అశోక్కుమార్ సింగ్ తెలిపారు. ‘తాజాగా నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రచార కార్యక్రమంలో ఆయన పేరును తొలగించాం. ఆయన ఇంటిని ప్రస్తుతం కిసాన్ సంఘ్ కార్యాలయంగా నిర్వహిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. వాజ్పేయ్ ఓటరు నెంబరు 1054. ఆయన 2000లో జరిగిన లఖ్నవూ పురపాలక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో చివరిసారిగా ఓటేశారు. తర్వాత అనారోగ్యం కారణంగా దిల్లీలో ఇంటికే పరిమితమయ్యారు.