కర్నూలు నగరంలో కుటుంబ సమస్యలతోపాటు మానసికస్థితి సరిగ్గా లేక మాధవినగర్లో నివాసముంటున్న సౌడు నిర్మల్ వంశీనాథరెడ్డి (34) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ నంద్యాల ప్రాంతానికి చెందిన బాలస్వామిరెడ్డి, వసంత కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం కాగా, పెద్ద కుమారుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా, రెండో కుమారుడు వంశీనాథరెడ్డి బీటెక్ వరకు చదువుకుని కర్నూలులోని మాధవీనగర్లో ఉంటున్నాడు.
ఏడాదిన్నర క్రితం వివాహమైంది. కొంతకాలంగా కుటుంబ సమస్యలతో పాటు మానసిక స్థితితో బాధ పడుతున్న యువకుడు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య విజయభారతి గుర్తించి ఇరుగుపొరుగు వారి సాయంతో కిందకు దించి పరిశీలించగా, అప్పటికే మృతి చెందాడు.
విజయభారతి ఫిర్యాదు మేరకు మూడవ పట్టణ హెడ్ కానిస్టేబుల్ చంద్ర గురువారం ఇంటి వద్దకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై విచారించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa