ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితులకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 01:28 PM

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కోట్ల క్యాంప్ కార్యాలయంలో కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాలు మేరకు టీడీపీ నేత కదిరికోట అదేన్న ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి తర్వాత దళితులకు అన్ని రంగాలలో పెద్దపీట వేసి అగ్రతాంబూలం పాడి దళిత తేజం విరాజిల్లేటట్లు చేసిన ఘనత టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేనని టీడీపీ నేత కదిరికోట ఆదెన్న పేర్కొన్నారు.


రాజకీయ దురుద్దేశంతోనే గురుకులాలకు లోకసభ స్పీకర్ దివంగత జి. ఎం. సి. బాలయోగి పేరును తొలగిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని, మారుమూల గ్రామం లో పుట్టి జాతీయస్థాయికి ఎదిగిన బాలయోగిని గౌరవించే విషయంలో సంస్కారంతో ఆలోచన చేయడం మంచిది కాదన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, జగన్ వైయస్ రాజశేఖర్రెడ్డి పేరుతో ఉన్న పథకాలకు వారి పేర్లు తొలగించుకొని అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన హయాంలో దళిత వర్గాలకు చెందిన మహనీయులను పథకాలకు పేర్లు పెట్టి గౌరవించిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రోజా ఆర్స్ ఉసేని, ఎరుకుల మారెన్న, మాల మణికంఠ, ఎరుకల రోగెన్న, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa