న్యూఢిల్లీ : ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) పథకాన్ని ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ప్రతీ గ్రామం, పట్టణం, ఇల్లు కాంతులతో నిండిపోవాలనే ఉద్దేశంతో సౌభాగ్య పథకాన్ని ప్రారంభించారు. 2019 మార్చి 31లోగా విద్యుద్ధీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. సౌభాగ్య పథకం మొత్తం వ్యయం అంచనా రూ.16,320 కోట్లు కాగా..మొత్తం వ్యయంలో రూ.12,320 కోట్లు కేంద్రం భరించనుంది. గ్రామాల్లో ఇళ్లకు రూ.14,025 కోట్లు, పట్టణాల్లో ఇళ్లకు రూ.1732.50 కోట్లు వ్యయం కానుంది. గ్రామాల్లో ఇళ్లకు విద్యుత్ కోసం రూ.10,587.5 కోట్లు, పట్టణాల్లో ఇళ్లకు విద్యుత్ కోసం రూ.2,295 కోట్లు వెచ్చించనుంది.