ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నెల్లూరులో యాష్ పాండ్ వద్ద నిర్మిస్తున్న ఇళ్లను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. పేదల ఇళ్లపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రతిపక్షానికి పేదల ఇళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి నారాయణ విమర్శించారు. గత ప్రభుత్వంలో కట్టిన ఇళ్లలో అధికశాతం నివాసయోగ్యం కావని నిపుణులే చెబుతున్నారని గుర్తు చేశారు.