ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌కల్యాణ్‌కు అంతర్జాతీయ పురస్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2017, 05:24 PM

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మరో అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. పవన్‌కల్యాణ్ ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (IEBF) ఎక్సలెన్స్ అవార్డును అందుకోనున్నారు. నవంబర్ 17న బ్రిటన్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్‌కల్యాణ్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఐఈబీఎఫ్ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి ప్రతీ ఏటా గ్లోబల్ బిజినెస్ మీట్ సందర్భంగా ఎక్సలెన్స్ అవార్డుతో గౌరవిస్తోంది. పవన్‌కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో వేలాదిమంది కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా నిలువడం, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ నేతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తూ..సామాజిక సమస్యల పరిష్కారం లో విశేష సేవలందించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారని ఐఈబీఎఫ్ ఇండియా విభాగం లీడర్ సునీల్‌కుమార్ గుప్తా అన్నారు. ఈ సందర్బంగా ఐఈబీఎఫ్ ఇండియా లీడర్ సునీల్‌కుమార్ గుప్తా, కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఐఈబీఎఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకోవాలని పవన్‌కల్యాణ్‌ను కోరారు. ఇటీవలే హార్వర్డ్ యూనివర్సిటీ పవన్‌కల్యాణ్‌ను గౌరవించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com