ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తృణమూల్ నుంచి ముకుల్ రాయ్ సస్పెండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2017, 02:46 PM

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ముకుల్ రాయ్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందే పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ముకుల్ రాయ్ ప్రకటించిన విషయం విదితమే. త్వరలోనే టీఎంసీకి రాజీనామా చేస్తానని రాయ్ ఇవాళ ఉదయం ప్రకటించారు. దసరా తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. వారం రోజుల క్రితం బీజేపీ నేతలతో సమావేశమైన ముకుల్ రాయ్.. ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. టీఎంసీని ఎందుకు వీడాల్సి వచ్చిందో దసరా తర్వాత చెప్తానని ముకుల్ రాయ్ తెలిపారు. అయితే తృణమూల్‌కు హృదయం మమత అయితే.. ముకుల్ మెదడు అని ఆ పార్టీ నేతలు అంటుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com