న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, పలువురు సీనియర్ నేతలతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగాలు, జీడీపీ అంశాలతో పాటు.. పార్టీ యంత్రాంగం బలోపేతం, రానున్న 4 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఎన్నికలే లక్ష్యంగా చర్చిస్తున్నారు. సమావేశం ముగింపు సమయంలో సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.