కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవహారాలకు గత కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్న ఎంపీ ముకుల్ రాయ్ సీఎం మమతా బెనర్జీకి షాకిచ్చారు. త్వరలోనే టీఎంసీకి రాజీనామా చేస్తానని రాయ్ ప్రకటించారు. దసరా తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. వారం రోజుల క్రితం బీజేపీ నేతలతో సమావేశమైన ముకుల్ రాయ్.. ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. టీఎంసీని ఎందుకు వీడాల్సి వచ్చిందో దసరా తర్వాత చెప్తానని ముకుల్ రాయ్ తెలిపారు. అయితే తృణమూల్కు హృదయం మమత అయితే.. ముకుల్ మెదడు అని ఆ పార్టీ నేతలు అంటుంటారు.