తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో సోమవారం ఉదయం భారీగా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో తిరుమలకు భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేశారు. అయితే... సోమవారం తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలై పది గంటలకల్లా భారీగా వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా... స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహ వాహనం సేవ జరుగుతుండగా వర్షంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తిరుమాఢ వీధుల్లో మలయప్ప స్వామి ఊరేగుతున్నారు.