కర్నూలు నగరంలోని స్థానిక సంకల్ బాగ్ లోని హరిహర క్షేత్రంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమిత వేంకటేశ్వరస్వామి 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలను వేద పండితులు శాస్తోక మంత్రోత్సవాల మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి టీజీ భరత్ ధ్వజారోహణం చేసి ఆరంభించారు.
కార్యక్రమంలో నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కల్లే చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్ కే రాజశేఖర్ రావు, గౌరవ సలహాదారు హెచ్ కే మనోహర్రావు, కార్యవర్గ సభ్యులు మాధవప్రభు, ప్రభాకర్, సోమిశెట్టి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa