కర్నూలు: శ్రీ సరస్వతి అమ్మవారి జన్మదినం మాఘశుద్ధ పంచమి ఈ నెల 5వ తేదిన పురస్కరించుకొని వేలాది భక్తాదులు ఉత్సవాలకు తరలిరనున్నారు. మరో రెండు రోజులే గడువు ఉన్న క్షేత్రం లో మాత్రం ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. కనీస ఏర్పాట్ల విషం లో దేవాదాయశాఖ నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తుంది. నిధులు లేవనే సాకుతో ప్రభుత్వ శాఖలు చేతులెత్తేశాయి, దక్షణ భారతదేశం లోనే ఏకైక సరస్వతి క్షేత్రానికి తరలిరనున్న భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన జిల్లా అధికారులు సౌకర్యాలను గాలికొదిలేశారు.
వేదకాలం నాటి క్షేత్రం శ్రీ కొలను భారతి ఆలయం కృత యుగం లో అమ్మవారు స్వయంభువు గా ఇక్కడ వెలిశారు, కర్నూలు జిల్లా ఆత్మకూరు నల్లమల అరణ్యం లో ఉన్న ఈ ఆలయం చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైవుంది. భారత దేశానికి ఈ ఆలయ పేరుపైనే నామకరణ జరిగిందని భరతుడు విజ్ఞాన వేత్తలతో చరిత్ర వ్రాయిన్చినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అమ్మవారి జన్మదిన ఉత్సవం వసంత పంచమి వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఆ ఒక్కరోజే వేలాదిమంది భక్తులు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ల నుంచి తరలివస్తారు.
అయితే భక్తులకు ముందస్తు వసతి ఏర్పాట్లు జగగలేదు, దేవాదాయశాఖ నిధులు లేవని తప్పించుకుంటే తమకెలాంటి సంబంధం లేదని ఇతర శాఖలు కూడా చేతులెత్తేశాయి. చిన్నారులకు అక్షరభ్యాస పూజలకు ఈ క్షేత్రం విశేషమైనది. గతం లో జిల్లా కలెక్టర్ ఆరు శాఖల అధికారులతో చర్చించి విస్తృత ఏర్పాట్లకు అదేసించేవారు. అయితే ప్రస్తుతం బడ్జెట్ సమస్య తో క్షేత్రాన్ని గాలికొదిలేశారు. అటవీశాఖ అభ్యంతరం తో ఉన్న మూడు అన్నదాన సత్రాలను మూసివేశారు. భక్తులకు త్రాగునీరు లేక, నీడ వసతి కరువై నాలుగు కి. మీ అటవీ మార్గం ట్రాఫిక్ జామ్ , పుణ్య స్నానాలకు కొలను లో నీరు ఇంకి పోయి భక్తులకు సమస్యల స్వాగతం పలుకుతున్నాయి. వేలాదిమంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ స్పందించి కనీస వసతులైన కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa