ప్రముఖ ద్విచక్ర వాహనాల ఉత్పత్తుల సంస్థ హోండామోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అరుదైన రికార్డు సాధించింది. ఒక్కరోజే 50 వేల బైక్లను విక్రయించింది. నవరాత్రి తొలిరోజున(సెప్టెంబర్ 21) హోండా నుంచి 50వేల బైక్లు అమ్ముడైనట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 122శాతం అధికమని పేర్కొంది. గతేడాది నవరాత్రి తొలిరోజున హోండా 23,702 యూనిట్లు విక్రయించింది.
పండగ సీజన్ కావడంతో కొనుగోళ్ల రద్దీ పెరిగిందని.. మిగతా ఎనిమిది రోజులు కూడా ఇలాగే ఉంటుందని భావిస్తున్నట్లు హోండా తెలిపింది. అందుకే ఉత్పత్తిని కూడా పెంచినట్లు పేర్కొంది. మరోవైపు బైక్లపై డిస్కౌంట్లను కూడా అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందీ సంస్థ. కొన్ని మోడళ్లపై రూ. 7,500 వరకు డిస్కౌంట్తో పాటు రూ.2వేల వరకు క్యాష్బ్యాక్లను అందిస్తోంది.