చిత్తూరు జిల్లా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూనియర్ డాక్టర్లు, ఇతర సిబ్బంది రెండు వర్గాలు విడిపోయి పోటాపోటీ తిరుపతి రుయా ఆస్పత్రిలో ఓ వివాదం ఇద్దరు వైదుల ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. ఆస్పత్రిలో రెసిడెంట్ వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ వెంకటరమణ తనకు జరిగిన అవమానానికి మనస్తాపం చెంది వసతిగృహంలోనే శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. గుర్తించిన జూనియర్ వైద్యులు ఆయన్ను అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు. వెంటనే సమాచారం అందుకున్న సబ్కలెక్టర్ నిశాంత్కుమార్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి రుయా సూపరింటెండెంట్ సిద్ధానాయక్ను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనకు కారణమైన రుయా పరిపాలనా విభాగం క్లర్క్ కృష్ణకుమారి కూడా ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 18న తనపై దుర్భాషలాడిన కృష్ణకుమారిపై చర్యలు తీసుకోలేదన్న మనస్తాపంతో రెసిడెంట్ డాక్టర్ వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాదంపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సంబంధిత క్లర్క్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని రుయా సూపరింటెండెంట్ను ఆదేశించారు.