రైతులను ఆదుకోవడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఏఐకేఎస్ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు మబ్బు అంజినయ్య, హనుమంతు విమర్శించారు. సోమవారం పెద్దకడబూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల సమస్యలపై ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐకేఎస్ నాయకులతోపాటు సీపీఐ తాలూకా కార్యదర్శి విజయభాస్కర్ యాదవ్, సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ కార్పొరేట్ల కోసం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించిందని గుర్తు చేశారు. రైతాంగానికి, వ్యవసాయానికి, మన దేశ ప్రజానీకానికి నష్టం కలిగించే వ్యాపార వర్గానికి చెందిన పెద్ద కార్పొరేట్ల మేలు కోసం చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చట్టాలను గమనించిన రైతాంగం, కార్మికులు, వ్యవసాయ కూలీల అండదండలతో దీక్షలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అలాగే మృతిచెందిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు. లఖింపూర్ ఖేరి నిందితులపై విచారణ చేస్తామని ప్రకటించిందని, రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు.
అనంతరం డిమాండ్లతో కూడుకున్న వినతిపత్రాన్ని తహసీల్దార్ కుమారస్వామికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి చంద్ర, సర్దార్ పటేల్, హనుమంతు, రంగస్వామి, నర్సప్ప, చెక్క నరసప్ప తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa