కోల్కతా: ఆసీస్తో రెండో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన కోహ్లీ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 19 పరుగుల వద్ద భారత్ రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం మైదానంలోకి వచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా పరుగులు రాబడుతూ దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే కెరీర్లో 45వ అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు. మరోపక్క రహానె కూడా 55 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కి 102 పరుగులు జోడించారు. తొలి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ధోనీ ఈ వన్డేలో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. పాండ్య కూడా 20 పరుగులకే పరిమితమయ్యాడు. మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులకే కుప్పకూలింది.
ఆసీస్ బౌలర్లు కౌల్టర్ నైల్, రిచర్డ్సన్ తలో 3 వికెట్లు దక్కించుకోగా అగర్, కమిన్స్ చెరో వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు.