గుంటూరు నగర శివారులోని అడవితక్కెళ్లపాడులో విషాదం ఘటన చోటుచేసుకుంది. రాజీవ్ గృహకల్ప సముదాయం వద్ద ఆడుకుంటోన్న ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కలు విరుచుకుపడి గాయపరిచాయి. ఉదరం సహా పలు భాగాల్లో గాయాలు కావడంతో బాలుడికి తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన గుంటూరు నగరంలోని జేజేహెచ్కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.