ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ సినిమా థియేటర్ పైనుంచి వ్యక్తి జారిపడి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ లోపల జనంతో కిక్కిరిసిన సమయంలో లైట్ బిగిస్తూ ఓ వ్యక్తి కింద జారి పడ్డాడు. దీంతో అంతా ఒక్కసారి షాక్కు గురయ్యారు. థియేటర్లో ఆపరేటర్గా పనిచేస్తున్న యానాది రావు లోపల లైట్ బిగిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎత్తులోనుంచి కిందపడటంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.