కోల్కతా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మూడోవికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 27వ ఓవర్లో అగర్ బౌలింగ్లో మనీశ్ పాండే (3) బౌల్డయ్యాడు. పాండే నిష్క్రమణ అనంతరం కేదార్ జాదవ్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 28 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. కోహ్లీ (58), జాదవ్ (1)తో క్రీజులో ఉన్నారు.